మకర సంక్రాంతి పండుగ హిందూ మతంలో చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ పండుగ వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశికి సంక్రమించే పుష్య మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. 2023 సంవత్సరంలో, ఈ పండుగను జనవరి 15 న జరుపుకుంటారు. చాలా ప్రాంతాలలో దీనిని ఖిచ్డీ, ఉత్తరాయణ మరియు లోహ్రీ అని కూడా పిలుస్తారు. మకర సంక్రాంతి నుంచి సీజన్ మారుతుంది. దీనితో పాటు మకర సంక్రాంతి రోజున ఖిచ్డీ తయారు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతగా పరిగణించ బడుతుంది. ఈ రోజున సూర్యారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మకర సంక్రాంతి నాటికి ఖర మాసం ముగియడంతో.. కొత్త మాసం కూడా ప్రారంభమవుతుంది.
ఈసారి మకర సంక్రాంతిని 2023 జనవరి 15న జరుపుకుంటారు. మకర సంక్రాంతి జనవరి 14న రాత్రి 08.43 గంటలకు ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి శుభ సమయం జనవరి 15న ఉదయం 06:47 గంటలకు ప్రారంభమై సాయంత్రం 05:40 గంటలకు ముగుస్తుంది. మరోవైపు మహాపుణ్యకాలం ఉదయం 07.15 నుంచి 09.06 వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం, ఈసారి మకర సంక్రాంతిని జనవరి 15న మాత్రమే జరుపుకుంటారు. పవిత్రమైన మరియు గొప్ప పుణ్య సమయాలలో స్నానం చేయడం మరియు దానం చేయడం శ్రేయస్కరం.
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కుండలో ఎర్రని పువ్వులు, అక్షతలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుని బీజ మంత్రాన్ని జపించండి. శ్రీమద్ భాగవతం యొక్క ఒక అధ్యాయాన్ని పఠించండి లేదా భగవత్ గీత ని పఠించండి. నవధాన్యాలు, దుప్పట్లు, నువ్వులు, నెయ్యి దానం చేయండి. కొత్త బియ్యంతో కిచ్డీ చేయండి. ఆహారాన్ని భగవంతునికి సమర్పించి ప్రసాదం రూపంలో తీసుకోవాలి. సాయంత్రం ఆహారం తినవద్దు. ఈ రోజు ఒక పేదవాడికి పాత్రలతో పాటు నువ్వులను దానం చేస్తే శనికి సంబంధించిన ప్రతి బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
మకర సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో ఉత్తరాయణం అని కూడా అంటారు. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం, ఉపవాసం, కథ, దానం, సూర్యభగవానుడి ఆరాధనలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసిన దానాలు ఫలిస్తాయి. ఈ రోజున శనిదేవునికి దీపదానం చేయడం కూడా చాలా శుభప్రదం. పంజాబ్, యూపీ, బీహార్, తమిళనాడులో కొత్త పంటలు పండించే సమయం ఇది. అందుకే రైతులు ఈ రోజును కృతజ్ఞతా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు నువ్వులు, బెల్లంతో చేసిన మిఠాయిలు పంచుతారు. అంతే కాకుండా మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం కూడా ఉంది.
మకర సంక్రాంతి రోజున, సూర్య దేవుడు తన కొడుకు శని ఇంటికి కూడా వస్తాడు. అంటే, ఈ పండుగ కొడుకు మరియు తండ్రి కలయికను కూడా సూచిస్తుంది. మరొక పురాణం ప్రకారం, మకర సంక్రాంతి రాక్షసులపై విష్ణువు సాధించిన విజయంగా కూడా జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున విష్ణువు భూమిపై ఉన్న రాక్షసులను సంహరించి, వారి తలలను నరికి మందర పర్వతంపై పాతిపెట్టాడని చెబుతారు. అప్పటి నుండి విష్ణువు యొక్క ఈ విజయాన్ని మకర సంక్రాంతి పండుగగా జరుపుకోవడం ప్రారంభమైంది. దీనితో పాటు, బెల్లం కాకుండా, నువ్వులు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజు నువ్వులను దానం చేసి వాడతారు మరియు ఈ ప్రక్రియ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం కూడా ఉంది.