అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లి తమ సంఘీభావం తెలపడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది

జగన్ నిర్ణయాన్ని కోటంరెడ్డి వ్యతిరేకిస్తున్నారా లేకా మరేదైనానా అన్న చర్చ జరుగుతుంది.

ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని అమరావతి రైతులతో చెప్పిన శ్రీధర్ రెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో మాట్లాడిన రైతులు జై అమరావతి అనాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని కోరగా, రైతులు ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా అనడానికి తనకు ఇబ్బందులు ఉన్నాయని ఆయన రైతులకు నచ్చజెప్పారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా తాను వెళుతున్న క్రమంలో రాజధాని రైతుల వద్దకు వెళ్లానని, వర్షాల కారణంగా వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే తనకు చెప్పాలని కోరానని  శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.