అమెరికా డాలర్ కాస్త బలహీన పడుతున్న సమయంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ బంగారం ప్రియుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి
ఆల్ టైమ్ గరిష్టాల నుంచి హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 5500కు పైగా పతనం అయ్యింది. అయితే సీన్ రివర్స్ అయ్యింది.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 70,650 మార్కుకు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే..రూ. 700 పెరిగిన 22క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం పది గ్రాములకు రూ. 70, 800 వరకు చేరుకుంది. ఇక 24క్యారెట్ల బంగారం ధర తులం రూ. 77, 220 వద్ద కొనసాగుతోంది
బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగి ప్రస్తుతం రూ. 91,500 మార్కును తాకింది
హైదరాబాద్ నగరంలో చూస్తే ఇక్కడ రూ. 2వేలు పెరగడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1.01 లక్షలు పలుకుతోంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాలను మారుతుంటాయి. మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ధరలను ముందుగా తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.