Site icon HashtagU Telugu

KTR sensational tweet: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్‎లు ఎంతో మంది ఉన్నట్లే కనిపిస్తోంది.

1112414 Ktr News

1112414 Ktr News

తెలంగాణ మంత్రి కేటీఆర్  (KTR sensational tweet)మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నట్లు అనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. రాజస్తాన్, తమిళనాడు యూనివర్సిటీ ల నుంచి ఫేక్ సర్టిఫికేట్లను కలిగిఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో అబద్దాలు చెప్పడం, క్రిమినల నేరం కిందకు రాదాంటూ ప్రశ్నించారు. లోకసభ స్పీకర్ దీనిని నిర్దారించకుండానే దోషులగా తేలితే అనర్హత వేటు చేయోచ్చుకదా అంటూ ప్రశ్నించారు.

డిగ్రీ సర్టిఫికేట్ల విషయంలో మోదీని టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ సంచలనానికి తెరలేపింది. నా స్టడీ సర్టిపికేట్లు నా దగ్గర ఉన్నాయ్ నేను చూపిస్తా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.