Tripura CM: త్రిపుర నూతన సీఎం మాణిక్ సాహా…!
త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు.
- By Hashtag U Published Date - 07:42 PM, Sat - 14 May 22
త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం భేటీ అయిన బీజేఎల్పీ భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాణిక్ సాహా ను తమ అధినేతగా ఎన్నుకున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాణిక్ సాహా..ఆపార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగుతున్నారు.
వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి బిప్లవ్ కుమార్ రాజీనామా చేశారు. బిప్లవ్ రాజీనామా చేసిన తర్వాత భేటీ అయిన బీజేఎల్పీ సమావేశంలో మాణిక్ సాహాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త సీఎంగా ఎన్నుకున్నారు.
Related News
Lok Sabha Polls 2024: మధ్యాహ్నం సమయానికి 50.96 శాతం ఓటింగ్
మధ్యాహ్నం 1 గంట వరకు లక్షద్వీప్లో అత్యల్పంగా 29.91% పోలింగ్ నమోదైంది. త్రిపురలో అత్యధికంగా 53.04% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 50 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.