Ponniyin Selvan : ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’ టీజర్ విడుదల చేసిన మహేశ్ బాబు
పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1' మూవీ రూపొందింది. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది.
- By Hashtag U Published Date - 11:16 AM, Sat - 9 July 22
పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’ మూవీ రూపొందింది. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. తెలుగు టీజర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా, హిందీలో అమితాబ్ బచ్చన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేశారు.
టీజర్లో పోరాట ఘట్టాలు, నటీనటుల నటన ఆకట్టుకుంది. ‘ఈ కల్లు, పాట, రక్తం, యుద్ధం అంతా దాన్ని మర్చిపోడానికే. ఆమెను మర్చిపోడానికి, నన్ను నేను మర్చిపోడానికి’ అంటూ విక్రమ్ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపిస్తుంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇది సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ మూవీ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ . ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Related News
Mahesh Babu: తేజా సజ్జాకు వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు.. అలా పిలవడం మానేయ్ అంటూ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలె గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా