Hyderabad : హైదరాబాద్ శివారు వైన్షాపులో చోరీ.. రూ.2 లక్షల నగదు అపహరణ
హైదరాబాద్ శివార్లలోని ఓ వైన్షాప్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉద్యోగుల నుంచి రూ.2 లక్షలకుపైగా నగదు
- By Prasad Published Date - 04:30 PM, Tue - 24 January 23
హైదరాబాద్ శివార్లలోని ఓ వైన్షాప్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉద్యోగుల నుంచి రూ.2 లక్షలకుపైగా నగదు ఎత్తుకెళ్లేందుకు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దమర్రిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుకాణం మూసి నగదుతో బయటకు వెళ్తుండగా ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు క్యాషియర్తో పాటు ఇతర ఉద్యోగులపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాపు ఉద్యోగులపై దుండగులు కర్రలతో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాధితులు ప్రతిఘటించడంతో దొంగల్లో ఒకరు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ వైన్ షాప్ షట్టర్ను తాకగా, రెండో బుల్లెట్ గాలిలోకి దూసుకెళ్లింది. ఉద్యోగుల నుంచి రూ.2.08 లక్షల నగదును అపహరించి నేరస్తులు పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమ ద్విచక్ర వాహనాలను స్టార్ట్ చేయబోతుండగా ముసుగు ధరించిన వ్యక్తులు తమపై దాడి చేశారని బాధితుల్లో ఒకరైన బాలకృష్ణ తెలిపారు. దుండగులు హిందీలో మాట్లాడుతున్నారని తెలిపారు. అంతర్ రాష్ట్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ముఠా సులభంగా తప్పించుకోవడానికి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలోని లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Related News
Suicide Game : భారత విద్యార్థిని బలిగొన్న ‘సూసైడ్ గేమ్’.. ఏమిటిది ?
Suicide Game : అమెరికాలో భారతీయుల మరణాలు ఆగడం లేదు. ఇందుకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి.