Devotional: శనివారం రావిచెట్టుకు ఇలా చేయండి…అప్పులు, కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

శనివారం అంటే శనిదేవుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. శనిదేవుడ్ని ఈరోజు ఆరాధించడం వల్ల జీవితంలో బాధలు తొలగిపోయి స్వేచ్చ లభిస్తుంది.

  • Written By:
  • Publish Date - June 4, 2022 / 06:00 AM IST

శనివారం అంటే శనిదేవుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. శనిదేవుడ్ని ఈరోజు ఆరాధించడం వల్ల జీవితంలో బాధలు తొలగిపోయి స్వేచ్చ లభిస్తుంది. శని కోపానికి గురైతే..సర్వం కోల్పోతాము. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం నాడు శనిదేవుడిని ఆరాధిస్తే…సంపద, శ్రేయస్సు లభిస్తుంది. శనిదేవుడిదయతో పాటు ఈ నివారణలను ఒకసారి ప్రయత్నిస్తే…జీవితంలో ఎప్పుడు కొరత అనేది ఉండదు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

అప్పుల బాధ తొలగిపోతుంది..
శనివారంనాడు రావి చెట్టుకు నీరు పోయాలి. పాలలో చక్కెర కలిపి చెట్టు మొదలు వద్ద పోయాలి. ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే శనిదేవుడి దయ మీపై ఉంటుంది. అప్పుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

దురదృష్టం తొలగుతుంది..
శనివారం నాడు ఇంట్లో మిరపకాయలను వాడకూడదు. కారం కోసం వంటలో మిరియాల పౌడరును ఉపయోగించాలి. ఈ విధంగా చేస్తే శనిదేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాదు ఏలినాటి శని కూడా తొలగిపోతుంది.

శని దుష్ప్రభావం తొలుగుతుంది..
శనివారం నాడు బియ్యం పిండిని చిన్న గుళికలుగా చేసి చేపలకు ఆహారంగా వేస్తే అంతా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే శని దోషం కూడా తొలగుతుంది. అంతేకాదు శని దుష్ర్పభావం కూడా పోతుంది.

దానం చేస్తే మంచిది..
నల్ల కుక్క, నల్ల ఆవు, నల్ల పక్షికి విత్తనాలు వేయాలి. ఇలా చేస్తే శనిదేవుడి క్రూరమైన ద్రుష్టి తొలగిపోతుంది. పేదలకు సహాయం చేయాలి. ఇలా చేస్తే అవంతారాలు తొలగుతాయి. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటారు.