Bigg Boss 6: ఆదిరెడ్డికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్?
బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో పాటు బిగ్ బాస్ ప్రేమికులు కూడా ఎంతో
- By Nakshatra Published Date - 02:43 PM, Tue - 22 November 22
బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో పాటు బిగ్ బాస్ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ షోలో మిగతా వారాలు ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న ఆది రెడ్డికి తాజాగా బిగ్ బాస్ ఒక ఊహించని సర్ప్రైజ్ ను ఇచ్చారు. ఆదిరెడ్డి కూతురు అద్వైత కి ఈ మధ్య ఏడాది నిండింది.
తన కూతురు పుట్టిన రోజు వేడుకలో ఉండలేకపోయానని ఆదిరెడ్డి బాధపడటంతో ఆ కోరికను తీర్చుతూ తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి తన కూతురు అద్వైత అలాగే భార్య కవితని పంపించాడు బిగ్ బాస్. కూతురు భార్య ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో ఆదిరెడ్డి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రేమతో తన కూతురిని ముద్దాడాడు ఆది రెడ్డి. అంతేకాకుండా తన కూతురిని భార్యని కిచెన్ లోకి పిలుచుకుని వెళ్లి కూతురికి ప్రేమతో గోరుముద్దలు తినిపించాడు. అనంతరం చెప్పు నాన్న నేను ఎలా ఆడుతున్నానో అంటూ తన భార్య కవితని అడిగాడు.
నీ పది ఓట్లు నాకే కదా అని ఆదిరెడ్డి అడగగా కవిత సిగ్గుపడుతూ అవును అన్నట్టుగా తల ఊపింది. నా డాన్స్ వరస్ట్ గా ఉంది కదా అని ఆదిరెడ్డి అడగగా.. లేదు నవ్వుకుంటున్నాం నవ్వుతూ చెప్పడంతో ఏంటి నువ్వు కూడా నవ్వుతున్నావా అని ఆదిరెడ్డి అడిగాడు. తర్వాత హౌస్ మేట్స్ అక్కడికి రావడంతో అందరూ మంచివాళ్లు,గేమ్ వరకు తిట్టుకోండి. కొట్టుకోండి..అని అనగా నన్ను కూడా కొట్టొచ్చా అని ఆదిరెడ్డి అనడంతో వెంటనే కవిత హా..నువ్వు ఏమైనా తోపా అంటూ ఆదిరెడ్డికి పంచ్ వేసింది. ఆ తర్వాత బర్త్డే కేక్ వేడుకలో భాగంగా కేక్ కట్ చేస్తూ లవ్ యు సో మచ్ థాంక్యూ అని చెప్పాడు ఆదిరెడ్డి. అయితే ఆదిరెడ్డి తన కూతురు భార్య లతో సంతోషంగా గడుపుతూ ఉండగా రేవంత్ కి కడుపుతో ఉన్న తన భార్య గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరూ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని సంతోషంగా ఉండగా రేవంత్ మాత్రం ఒకచోట కూర్చుని వాళ్ళని చూస్తూ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.
Related News
YS Sharmila: పులివెందుల సభలో స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన వైఎస్ షర్మిల
ఏపీ రాజకీయంలో వైఎస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రస్తుతం పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాంగా ఆమె ఎమోషనలయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్, మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.