Three Died: భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. ముగ్గురు మృతి
కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపైకి వేగంగా టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
- By Gopichand Published Date - 02:35 PM, Thu - 12 January 23
కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపైకి వేగంగా టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు వేరువేరు గ్రామాలకు చెందిన ఓబులేసు, నాగ సుబ్బారెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. టిప్పర్ పొలాల్లోకి దూసుకెళ్లి పడిపోవడంతో ఉప్పలపాడు గ్రామానికి చెందిన డ్రైవర్ విజయ్ కుమార్ మృతి చెందాడు. .
Also Read: Bird flu: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 1800 కోళ్లు మృతి!
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
AP Volunteers: ఏపీలో ఇప్పటివరకు 62 వేల వాలంటీర్ల రాజీనామా
గ్రామ వాలంటీర్ల రాజీనామాల ఆమోదానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోర్టును అభ్యర్థించాయి.