PM Modi in Egypt: విజయవంతమైన అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఈజిప్ట్ (PM Modi in Egypt) చేరుకున్నారు. తన పర్యటన మొదటి రోజున ప్రధాని మోదీ ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దెల్-కరీం ఆలమ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశం, ఈజిప్టు మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాల గురించి కూడా చర్చ జరిగింది. మరోవైపు రెండవ రోజు ప్రధాని పర్యటన గురించి మాట్లాడినట్లయితే.. ఈ రోజు అంటే ఆదివారం (జూన్ 25) ఆయన ఈజిప్ట్ పర్యటనకు చివరి రోజు. ప్రధాని మోదీ తన రెండో రోజు పర్యటనలో ప్రధాని మోదీ అల్-హకీమ్ మసీదును సందర్శిస్తారు. అలాగే ఈజిప్టు అధ్యక్షుడు అల్-సిసిని కలవనున్నారు.
ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్
తన రెండవ రోజు పర్యటనలో, ప్రధాని మోడీ మొదట భారతీయ బోహ్రా దావూదీ కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు చారిత్రాత్మక అల్-హకీమ్ మసీదును సందర్శిస్తారు. దీని తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 3,799 మంది భారతీయ సైనికులకు నివాళులర్పించేందుకు ప్రధాని మోదీ హెలియోపోలిస్ యుద్ధ శ్మశానవాటికను కూడా సందర్శించనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసితో భేటీ కానున్నారు.
Also Read: Pakistan On PM Modi: ప్రధాని మోదీని మెచ్చుకుంటున్న పాక్ ప్రజలు.. ఎందుకో తెలుసా..?
ఈజిప్ట్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ ట్వీట్
మరోవైపు ఈజిప్ట్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ఈ పర్యటన ఈజిప్ట్తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్-సిసితో చర్చలు జరపడానికి, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను ఎదురు చూస్తున్నాను అన్నారు. ఈజిప్ట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ సంతతి సమాజం ఘనంగా స్వాగతం పలికింది. హోటల్ రిట్జ్ వద్ద భారతీయ కమ్యూనిటీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రవాస భారతీయులతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రజలు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని వందేమాతరం, మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు జెనా అనే అమ్మాయి షోలే చిత్రంలోని ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాటను పాడింది.
ప్రధాని మోదీ పర్యటన ఇలా
13:10-13:40 pm – అల్ హకీమ్ మసీదు సందర్శన
14:00-14:25 pm – హెలియోపోలిస్ వార్ స్మశానవాటిక పర్యటన
14:30-14:45 గంటలు – ఈజిప్షియన్ ప్రెసిడెన్సీలో ఈవెంట్లు, ఈజిప్ట్ అధ్యక్షుడితో సమావేశం
16:00-16:10 pm – అవగాహన ఒప్పందంపై సంతకం
16:15-16:30 – ప్రెస్ స్టేట్మెంట్ విడుదల
16:30-17:20 pm – ఈజిప్ట్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భోజనం, అనంతరం విలేకరుల సమావేశం