Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి

కర్నాటకలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది.

  • Written By:
  • Updated On - March 25, 2023 / 08:26 PM IST

కర్నాటకలో (Karnataka) మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (pm modi)పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది. మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి. ప్రధాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దావణగెరెలో జరిగింది. రోడ్ షోలో వెళ్తున్న ప్రధానమంత్రి మోదీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం గుమిగూడారు. ఇంతలో ఓ వ్యక్తి తోసుకుంటూ వచ్చి ప్రధాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాదాపు ప్రధాని కారు దగ్గరకు చేరుకోగానే…భద్రతా బలగాలు అతన్ని అడ్డుకున్నాయి.

అంతకుముందు జనవరిలో కర్నాటకలో హుబ్లీలో ప్రధానిమోదీ రోడ్ షో జరిగినప్పుడు కూడా ఓ చిన్నారి ప్రధానికి దగ్గరగా వచ్చాడు. ఆరో తరగతి చదువుతున్న చిన్నారి ప్రధాని మోదీకి పూలమాల వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న ఎస్పీజీ జవాన్లు పిల్లాడిని అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రధానమంత్రి భద్రతలోపాన్ని చూపాయి. అయితే కర్నాటక పోలీసులు దీనిని భద్రతాలోపంగా పేర్కొనలేదు.